నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 - తాండవం సినిమా ఈ నెల 5న రిలీజ్ కావాల్సి ఉంది. 4వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్లు కూడా ప్లాన్చేశారు. ఇక ప్రీమియర్ టిక్కెట్లు కూడా వచ్చేశాయి. థియేటర్ల దగ్గర నందమూరి ... బాలయ్య అభిమానులు కటౌట్లు పెట్టి హంగామాకు రెడీ అయిపోయారు. ఓ వైపు సినిమా కూడా లోడింగ్ అయిపోయింది. ఈ టైంలో ఏరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ తో ఈ సినిమా మేకర్స్ అయిన 14 ఫ్లస్ రీల్స్ వారికి ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఓ వైపు మేకర్స్ రు. 28 కోట్ల ఫైనాన్షియల్ ఇష్యూను క్లీయర్ చేసేందుకు గత నాలుగు రోజులుగా అనేక మీటింగ్లు పెట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు అఖండ 2 వివాదానికి చెక్ పడినట్లు తెలుస్తోంది.
గత రాత్రి సైతం 14 ఫ్లస్ రీల్స్ కు , ఈరోస్ ప్రతినిధులకు మధ్య సానుకూల చర్చలు జరిగాయని టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. దీనిపై ఈ రోజు మద్రాస్ హై కోర్టులో విచారణ జరగనుంది. ఇందులో ఇదే విషయాన్ని చెప్పి సినిమా రిలీజ్కు అనుమతులు తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు. 11న రాత్రి సెకండ్ షో నుంచి ప్రీమియర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి