తెలుగు, తమిళ్ ,మలయాళం ,హిందీ  వంటి ప్రేక్షకులకు దివంగత హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చక్కటి చీర కట్టులో గ్లామర్ షో చేయకుండా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది సౌందర్య. దశాబ్దకాలం పాటు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలతో నటించిన సౌందర్య అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కానీ 2024 లో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్య మరణించింది. సౌందర్య మరణించే సమయానికి రెండు నెలల గర్భవతి అని, సౌందర్య తో పాటు ఆమె సోదరుడు కూడా మరణించారు.ఇప్పటికీ కూడా సీనియర్ నటి నటులు ఎంతోమంది సౌందర్య గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి


.తాజాగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఆర్యీ ఉదయ్ కుమార్ సౌందర్య తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ పలు విషయాలను తెలిపారు. నిజానికి సినీ రంగానికి సౌందర్యాన్ని నటిగా పరిచయం చేసింది ఈయనే. సౌందర్య గురించి మాట్లాడుతూ సినిమా ప్రపంచంలో సౌందర్య లాంటి అద్భుతమైన నటిని తాను ఇంతవరకు చూడలేదని సంవత్సరానికి 10 సినిమాలలో నటించే ఆమె ఎప్పుడూ కూడా స్టార్ అనే ఒక యాటిట్యూడ్  ఎక్కడా చూపించలేదని తెలిపారు.


రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమాకి ముందు సౌందర్య కాల్ షీట్స్ లేనంత బిజీ హీరోయిన్గా మారిపోయిందని అయినా కూడా అందరిని చాలా చక్కగానే మాట్లాడిచ్చేదని తెలిపారు. సౌందర్య మరణించడానికి రెండు రోజుల ముందు 2004 ఏప్రిల్ 15న తన భార్య సుజాతకు కాల్ చేసిందని తెలిపారు డైరెక్టర్. అయితే ఆ సమయంలో సౌందర్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా చెప్పిందని తెలిపారు. అలా తనతో కూడా కొద్దిసేపు మాట్లాడి ప్రచారానికి వెళ్లొచ్చి అలసిపోయాను, అయిపోయిన తర్వాత కలుస్తానని ఫోన్ పెట్టేసిందని తెలిపారు డైరెక్టర్ ఆర్వీ. ఆ తర్వాత కొన్ని గంటలకి నటుడు సత్యరాజ్ సార్ వచ్చి తనకు సౌందర్య మరణించిందనే విషయాన్ని చెప్పారని ఆమె మరణ వార్త తాను నమ్మలేకపోయాను అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: