ఓ వైపు యాంకరింగ్…మరో వైపు సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనసూయ ఇప్పుడు మరో రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బుల్లితెర మీద హాట్ యాంకర్ ఇమేజ్తో పాటు వెండితెర మీద కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆమె నిర్మాతగా మారుతోంది. ప్రస్తుతం అనసూయ అమెరికాలో జరుగుతున్న తానా మహా సభలలో పాల్గొనడానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె తానాలో ఉన్న తన సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిందట.
తాను నిర్మాతగా మారుతున్నానని... అందుకు మీ ఆశీస్సులు కావాలని కూడా వాళ్లను అడిగినట్టు తెలుస్తోంది. నటిగా కంటెంట్ ఉంటే తప్ప మరో బూతు, బుట్రా టైప్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోని అనసూయ... నిర్మాతగా ఎంట్రీ ఇస్తే మరిన్ని మంచి సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. దీనిని బట్టి కంటెంట్లో దమ్మున్న కథలతోనే ఆమె సినిమాలు చేస్తుందని అర్థమవుతోంది.
ఈ క్రమంలోనే ఆమె తన పేరు మీదే బ్యానర్ కూడా స్టార్ట్ చేసిందట. ‘అనసూయ పిక్చర్స్’ పేరుతో ఆమె బ్యానర్ ఏర్పాటు కాబోతుందని... ముందుగా సినిమాల్లో పెట్టుబడులు పెట్టకుండా ... వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఆమె ఉందని అంటున్నారు. పెళ్లి అయి పిల్లలు పుట్టాక యాంకర్ గా జీవితం మొదలుపెట్టిన అనసూయ రంగస్థలం లాంటి సినిమాలతో నటిగానూ ప్రూవ్ చేసుకుంది. ఇక ఇప్పుడు నిర్మాతగా ఎలా సక్సెస్ అవుతుందో ? చూడాలి.