2014 వ సంవత్సరంలో అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తరువాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత సినిమాల్లో నటించాడు.కానీ ఈ సినిమాల్లో ఏ సినిమా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్ ఇవ్వలేదు.వి వి వినాయక్, బోయపాటి శ్రీనులాంటి స్టార్ డైరెక్టర్లు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్ ఇవ్వలేకపోయారు. ప్రసుతం బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. 
 
మరో మూడు రోజుల్లో  విడుదల కాబోతుంది రాక్షసుడు సినిమా. స్టార్ డైరెక్టర్లు డైరెక్షన్ చేస్తున్నా, స్టార్ హీరోయిన్లతో నటిస్తున్నా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటిదాకా కెరీర్లో చెప్పుకోతగ్గ హిట్ లేదు. అందుకే ఈసారి తమిళంలో హిట్టైన 'రాట్చసన్ ' సినిమా రీమేక్లో నటిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తోంది. 
 
స్కూల్ కి వెళ్ళే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ కేసు మిస్టరీని చేధించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. 
 
 
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడని సినిమా యూనిట్ ఆశిస్తోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సెన్సార్ వర్గాల నుండి "యు/ఎ" సర్టిఫికెట్ అందుకుంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రైడ్ ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఎ స్టూడియోస్ మరియు అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: