టాలీవుడ్ లో మెగా హీరోలు ఇప్పటి వరకు తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో స్వయంకృషితో అప్పటి స్టార్ హీరోల పోటీని ఎదుర్కొంటు పట్టుదలతో తన డ్యాన్స్, ఫైట్స్ తో మెప్పించారు చిరంజీవి. ఆయన బాటలో నడుస్తున్న ఈతరం హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు టాలీవుడ్ తో తమదైన ముద్ర వేస్తున్నారు.
తాజాగా మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుందా సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మెగా హీరోలందరిలో చిరంజీవి తరహా నటనా వైవిధ్యం చూపిస్తున్న వరుణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన వాల్మీకి టీజర్ వరుణ్ తేజ్లోని వైవిధ్యాన్ని మరోసారి చూపించింది. ఇలా సినిమా జయాపజయాలతో సంబంధంలేకుండా కథల ఎంపికలో తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు.
టాలీవుడ్ కామ్ గోయింగ్ హీరోగా ముద్రపడిన వరుణ్ తేజ్ త్వరలో పెళ్లిపీలు ఎక్కనున్నాడా..? అంటే చిత్రపురి కాలనీ వాసుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతటితో ఆగని వారు హైదరాబాద్లోని ఓ పారిశ్రామిక బ్యాక్గ్రౌండ్ కలిగిన కుటుంబంతో పెళ్లికి సంబంధించిన మాటా మంతి కూడా జరిగిపోయిందని చెబుతున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు అండ్ ఫ్యామిలీ ఇప్పటికే ఆ బఢా వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి మాట్లాడారని, అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ మెగా కుటుంబం నుంచి అతి త్వరలోనే మీడియాకు చేరనుందని సమాచారం. ప్రస్తుతం వాల్మీకి చిత్రంలో నటిస్తున్న వరుణ్ తేజ్ ఆ తరువాత మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడు. అంతేకాకుండా తన వద్దకు వచ్చిన కథలను సెలెక్టివ్గా ఎంపిక చేస్తూ షూటింగ్స్కి కమిట్ అవుతున్నాడు. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ పెళ్లి మేటర్ ఫిల్మ్సిటీ సర్కిల్స్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.