ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ,సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో తమన్నాస్పెషల్ సాంగ్ లో ,మహేష్ తో కలిసి స్టెప్పులు వేయనుంది. ఐటమ్ సాంగ్స్ ను కంపోజ్ చేయడం లో దిట్టైనా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసారి ఎలాంటి సాంగ్ ఇస్తాడో చూడాలి. ఇక గతంలో మహేష్ బాబు సరసన 'ఆగడు' సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఇప్పుడు అదే హీరోతో ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది.
ఇకఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 అనే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది . ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. దాంతో అనిల్ రావిపూడి సెంటిమెంట్ కింద తమన్నాను సరిలేరు నీకెవ్వరు లో స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా దిల్ రాజు , అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.