టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ మరియు ఒక లిరికల్ సాంగ్, సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెంచేసాయి. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సహా, పలువురు ఇతర నటులు సైరా గురించి మాట్లాడిన దానిని బట్టి చూస్తుంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత కథను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు సురేందర్ రెడ్డి దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితం జరిగాయి. కాగా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇక సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఎంతో అద్భుతంగా ఉంది అంటూ సైరా దర్శక నిర్మాతలను, అలానే మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యువత మన దేశ చరిత్రను మరిచిపోతున్నారని, అయితే అటువంటి వారికి మన దేశ చరిత్రలో ముఖ్య భాగమైన స్వాతంత్రోద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, 

అలానే స్వతంత్రం కోసం పోరాడిన తొలి యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి ఈ సినిమాలో ఎంతో గొప్పగా చూపించారని సినిమా యూనిట్ ని కొనియాడారట సెన్సార్ సభ్యులు. టైటిల్ రోల్ పోషించిన మెగాస్టార్, సినిమాలో తన పెర్ఫార్మన్స్ ని ఇరగదీశారని, ఇక సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, వంటివారు ఎంతో అద్భుతంగా నటించడం జరిగిందని అన్నారట. ఇకపోతే సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయని, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ మరియు యాక్షన్ సెన్స్ అయితే సినిమాకు ఎంతో ప్రాణం అని వారు చెప్పినట్లు సమాచారం. ఇక వారు చెప్పిన దానిని బట్టి చూస్తుంటే, సైరా సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొట్టే గట్టిగా కనపడుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: