ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు యాదార్థ ఘటనల అధారంగా చిత్రాలు నిర్మిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెగ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా బాలాజీ దర్శకత్వం ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో అందాల భామలు అంజలి, రాయ్ లక్ష్మిలు గా నటించబోతున్నారు. ఆర్కె స్టూడియోస్ బ్యానర్పై ఎం. రాజ్కుమార్ నిర్మించనున్నారు. వినూత్నమైన కథతో ఈ సినిమా తీస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘గీతాంజలి, చిత్రాంగద’ వంటి థ్రిల్లర్స్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు అంజలి. ‘జూలీ 2’ సినిమాతో ఇటీవల బాలీవుడ్లో హాట్ హాట్గా ఎంట్రీ ఇచ్చారు సౌత్ బ్యూటీ రాయ్లక్ష్మీ.
ఇప్పుడు ఈ గీతాంజలి, జూలీ ఓ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. సాయికుమార్, నరేశ్, శివప్రసాద్, ధన్రాజ్, జాకీ, అశోక్కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దత్తి సురేష్ కుమార్.