ఎన్నారైలు రద్దయిన నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ 2017 జూన్ 30వరకు గడువిచ్చింది. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు విదేశాల్లో ఉన్న ఎన్నారైలు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. అలాగే ఈ కాలావధిలో విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు(రెసిడెంట్ ఇండియన్ సిటిజన్స్) 2017 మార్చి 31 వరకు నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బు మార్చుకోవాలన్న దానిపై పరిమితి లేదని, ఎన్నారైలకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద(ఒక్కొక్కరు రూ. 25వేలు) పరిమితి ఉంటుందని పేర్కొంది.