ఇది ఇలా ఉండగా ఈ లాక్డౌన్ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్లైన్లో గడపడం ఈ పరిస్థితులకు దారి తీసిందని పలువురు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు తప్పక పిలల్లని గమనించాలి. ఇలా చెయ్యకపోతే పిల్లలు దారి తప్పి ఇటువంటి వాటికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ బెట్టింగ్లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్లైన్ లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఆన్లైన్ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. డబ్బులు కాళీ అయినా అదే దారిలో వెళ్తున్నారు. మొదట డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో ఉంది ఆడడానికి వెళ్లి.... ఆఖరికి అప్పులపాలై వస్తున్నారు. ఇలా వీళ్ళు లక్షల్లో నష్టపోతున్నారు. ఆఖరికి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు అని అధికారులు అంటున్నారు. టైం పాస్ కోసం ఆన్లైన్ రమ్మీ కి అలవాటు పడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు వగైరా వాటికి దారి తీస్తోంది.