దుర్గగుడిలో మరో వివాదం రాజుకుందా...ఈవో వర్సెస్ పాలకమండలి సభ్యుల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయా.. ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పాలకమండలి ఆరోపిస్తుంటే నా పరిధిలోనివి మాత్రమే చేస్తున్నానంటూ ఈవో చెపుతున్న వైఖరిపై దుర్గగుడి పాలకమండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అసలు ఇంతకీ దుర్గగుడిలో ఏం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన దుర్గగుడి లో రేగుతున్న వివాదాలకు కారణాలేంటి
ఇదిలా ఉంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈవో, పాలకమండలి మధ్య విభేధాలు తలెత్తడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే మాదిరి వివాదాలు నెలకొన్న సమయంలో ఇంద్రకీలాద్రి ప్రతిష్ట మసకబారింది. ప్రస్తుతం తాజా వివాదాలతోనూ మరోసారి వివాదాలు ముదరుకుండా ఉన్నతాధికారులు, దేవాదాయశాఖ మంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి దసరా ఉత్సవాల లోపు వీరి మధ్యనున్న విభేధాలు తొలగిపోతాయా లేదా అనేది