ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే నైనిటాల్ సరస్సు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నైనిటాల్ సరస్సు కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల పైకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడిపోతున్నారు. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. వీరిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. భారీ వరద నీటికి రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. గౌలా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే గౌలా నదిపై హల్ద్వానీ ప్రాంతంలో నిర్మించిన వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇక చంపావత్ ప్రాంతంలోని కూడా చల్తీ నదికి వరద నీరు పొటెత్తింది. నదిపై నిర్మించిన వంతెన పూర్తిగా కూలిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే నైనిటాల్ సరస్సు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నైనిటాల్ సరస్సు కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల పైకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడిపోతున్నారు. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. వీరిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. భారీ వరద నీటికి రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. గౌలా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే గౌలా నదిపై హల్ద్వానీ ప్రాంతంలో నిర్మించిన వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇక చంపావత్ ప్రాంతంలోని కూడా చల్తీ నదికి వరద నీరు పొటెత్తింది. నదిపై నిర్మించిన వంతెన పూర్తిగా కూలిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.