ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ ప్లీనరీలో టీడీపీ కోవర్టులు తెగ హల్ చేస్తున్నారు. ఆ రోజు ఉద్యమంలో లేనివారంతా ఇవాళ వేదికపై కనిపించి ఆనందంగా ఉన్నారు. మరి! మోసపోయింది ఎవరు ప్రజలే కదా! అయినా కూడా టీడీపీ కోవర్టులకు లోటే లేదు. ఆ రోజు ఎవ్వరూ మాట్లాడకపో యినా, టీడీపీ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలం తా టీఆర్ఎస్ లో చేరిపో యారు. నామా నాగేశ్వరరావు లాంటి నేతలు హాయిగా ఉన్నారు. పదవులు అందుకున్నారు. అదేవిధం గా క్యాడర్ ను బలోపేతం చేసుకున్నారు. మరి! తల్లి లాంటి టీడీపీని వీరు పట్టించుకున్నారా? ఏం పట్టించుకుంటారు? ఒక్క నామా నాగేశ్వరరావు అనే కాదు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు ఇంకా ఇంకొందరు ఇవాళ పార్టీ పదవులు అందు కుని హాయిగా ఉన్నారు.
ఇరవై ఏళ్ల పార్టీలో ఉద్యమాలు ఉన్నాయి. గులాబీ దండు కవాతులో ఆ రోజు వీళ్లెవ్వరూ లేరు. అదేవిధంగా టీడీపీలో పదవులు అందుకుని హాయిగా పదవులు అనుభవించి దురదృష్టమో అదృష్టమో తెలంగాణ ఇంటి పార్టీలో చేరిపోయారు. ఇవాళ వేదికపై చాలా మంది టీడీపీ కోవర్టులు ఉన్నారు. వారినెవ్వరినీ కేసీఆర్ ప్రశ్నించరు కానీ ఇకపై వారితో సాగే ప్రయాణం సాఫీగా ఉంటుందా లేదా అన్నది ఓ సందిగ్ధం.