గత ఉపఎన్నికల ఓటమిపై ఎందుకు సమీక్షించ లేదని కొందరు సీనియర్లు ప్రశిస్తున్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసి ఓటమి పైనా చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. ఇదే డిమాండ్ తో కేసి వేణుగోపాల్ కు లేఖ రాశారు. హైకమాండ్ హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలకే పరిమితం అవుతుందా .. లేక అన్నింటి పైనా చర్చిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో వచ్చిన మొదటి ఉప ఎన్నిక కావడడం.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.
మరోపక్క కాంగ్రెస్ లోపాయికారిగా బీజేపీ గెలుపునకు సహకరించిందనే వాదనలు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర మాటల యుద్ధం కూడా నడిచింది. సీనియర్ నాయకులు దొరికిందే ఛాన్స్ అన్న విధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దుమారం తీవ్ర తరం కావడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై అధిష్టానం దృష్టి సారించింది.