ఒకరకంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే శివసేన పార్టీయే బీజేపీకి పెద్ద తలపోటుగా పరిణమించినట్టు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య అసలు ఎందుకింత శత్రుత్వం పెరిగిందనేది ఆసక్తికరం. దేశ రాజకీయాల్లో కీలకమైన మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసిన కారణంగానే మొదట్లో బీజేపీ అక్కడ బలం పెంచుకోగలిగింది. గత ఎన్నికల ఫలితాల తరువాత శివసేన కంటే బీజేపీయే అక్కడ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. ఇది శివసేనలో గుబులు పుట్టించిన పరిణామం. బీజేపీని అక్కడే నిలువరించకపోతే తన ఉనికికే ప్రమాదమని భావించడం తోనే శివసేన ఆ పార్టీతో విభేదించి సిద్ధాంత వైరుధ్యాలను అధిగమించి మరీ కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది బీజేపీకి ఏమంత కొరుకుడు పడని రాజకీయ పరిణామం. ఎందుకంటే యూపీ తరువాత మహారాష్ట్ర అత్యధిక ఎంపీ స్థానాలను కలిగిఉన్న రాష్ట్రం. అంతేకాదు దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఉన్నదీ ఆ రాష్ట్రంలోనే. శివసేనకు తమ పార్టీతో కలవకతప్పదని, మరో ప్రత్యామ్నాయం లేదని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. కానీ ఆ పార్టీ అనుకున్నట్టు జరగలేదు సరికదా ఇప్పుడు శివసేన గోవా సహా, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పోటీకి దిగుతానంటోంది. అంటే తమదే అసలైన హిందుత్వ పార్టీ అంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా బీజేపీ ఓటుబ్యాంకుకు గండి కొట్టాలనుకుంటోందన్నమాట. శివసేన ప్రభావం ఇతర రాష్ట్రాల్లో ఏమేరకు ఉంటుందన్నది భవిష్యత్తులో బీజేపీ విజయావకాశాలను నిర్ణయించే అంశం కావచ్చు.
ఒకరకంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే శివసేన పార్టీయే బీజేపీకి పెద్ద తలపోటుగా పరిణమించినట్టు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య అసలు ఎందుకింత శత్రుత్వం పెరిగిందనేది ఆసక్తికరం. దేశ రాజకీయాల్లో కీలకమైన మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసిన కారణంగానే మొదట్లో బీజేపీ అక్కడ బలం పెంచుకోగలిగింది. గత ఎన్నికల ఫలితాల తరువాత శివసేన కంటే బీజేపీయే అక్కడ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. ఇది శివసేనలో గుబులు పుట్టించిన పరిణామం. బీజేపీని అక్కడే నిలువరించకపోతే తన ఉనికికే ప్రమాదమని భావించడం తోనే శివసేన ఆ పార్టీతో విభేదించి సిద్ధాంత వైరుధ్యాలను అధిగమించి మరీ కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది బీజేపీకి ఏమంత కొరుకుడు పడని రాజకీయ పరిణామం. ఎందుకంటే యూపీ తరువాత మహారాష్ట్ర అత్యధిక ఎంపీ స్థానాలను కలిగిఉన్న రాష్ట్రం. అంతేకాదు దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఉన్నదీ ఆ రాష్ట్రంలోనే. శివసేనకు తమ పార్టీతో కలవకతప్పదని, మరో ప్రత్యామ్నాయం లేదని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. కానీ ఆ పార్టీ అనుకున్నట్టు జరగలేదు సరికదా ఇప్పుడు శివసేన గోవా సహా, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పోటీకి దిగుతానంటోంది. అంటే తమదే అసలైన హిందుత్వ పార్టీ అంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా బీజేపీ ఓటుబ్యాంకుకు గండి కొట్టాలనుకుంటోందన్నమాట. శివసేన ప్రభావం ఇతర రాష్ట్రాల్లో ఏమేరకు ఉంటుందన్నది భవిష్యత్తులో బీజేపీ విజయావకాశాలను నిర్ణయించే అంశం కావచ్చు.