కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైట్ కొనసాగిస్తూనే ఉన్నరన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ నుంచి దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాన్ని నడపాలన్నారు కేసీఆర్. ఈ నెల 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైతు సంఘం నాయకుడు తికాయత్ కూడా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో హైదరాబాద్లో విద్యుత్ సంఘాలతో సమావేశం కానున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్ లో సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైట్ కొనసాగిస్తూనే ఉన్నరన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ నుంచి దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాన్ని నడపాలన్నారు కేసీఆర్. ఈ నెల 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైతు సంఘం నాయకుడు తికాయత్ కూడా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో హైదరాబాద్లో విద్యుత్ సంఘాలతో సమావేశం కానున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్ లో సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.