ఇక రోడ్ల నిర్మాణానికి 16 మాసాలు నీటి సరఫరా డ్రైనేజి విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 36 నెలల టైం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. మొదటి దశలో రాజధాని అభివృద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రు. 1.09 లక్షల కోట్లు అవసరమవుతుందని కూడా గుర్తుచేసింది.మొత్తానికి ఇక తీర్పు వచ్చిన ఇన్ని రోజులకు ప్రభుత్వం తన మనసులోని మాటను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు వివరించడం జరిగింది. ఇక్కడ చెప్పిన రు. 1.09 లక్షల కోట్లు అవసరమన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసిన అంచనాయే. దాన్నే యధాతధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది.కేంద్ర ప్రభుత్వం ఎలాగూ ఈ మొత్తం ఇవ్వదు.ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అందుకే ఏ రూపంలో చూసినా కాని హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇక రోడ్ల నిర్మాణానికి 16 మాసాలు నీటి సరఫరా డ్రైనేజి విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 36 నెలల టైం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. మొదటి దశలో రాజధాని అభివృద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రు. 1.09 లక్షల కోట్లు అవసరమవుతుందని కూడా గుర్తుచేసింది.మొత్తానికి ఇక తీర్పు వచ్చిన ఇన్ని రోజులకు ప్రభుత్వం తన మనసులోని మాటను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు వివరించడం జరిగింది. ఇక్కడ చెప్పిన రు. 1.09 లక్షల కోట్లు అవసరమన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసిన అంచనాయే. దాన్నే యధాతధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది.కేంద్ర ప్రభుత్వం ఎలాగూ ఈ మొత్తం ఇవ్వదు.ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అందుకే ఏ రూపంలో చూసినా కాని హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.