ఇక రైతులు పడుతున్న కష్టాలను ఆమె కళ్లారా చూసింది. అలాగే తన తండ్రి కూడా స్వయంగా రైతు కావడంతో సాగులో ఇబ్బందులన్నీ గ్రహించింది. వారి కష్టాలను గట్టెక్కించాలని ఆమె ఆకాక్షించింది.ఇక అనుకున్నదే తడవుగా తన చదువు పూర్తైన వెంటనే ఆమె స్టార్టప్ ఏర్పాటు చేసింది. రైతులకు మార్కెట్ కష్టాలు లేకుండా చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా లాభాలు గడిస్తోంది. ఇక ఆమె తమిళనాడుకు చెందిన 'ది గుడ్ లీఫ్' సంస్థను స్థాపించిన దీపికా రవి. రైతులకు అండగా నిలుస్తున్న ఆమె వ్యాపార విజయ గాథ వెనుక కథ ఇలా ఉంది.ఇక తమిళనాడులోని కరూర్‌లో దీపికా రవి పుట్టి పెరిగింది. అయితే ఆమె తన స్వస్థలంలోని రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి పడుతున్న కష్టాలను ఆమె చూసింది. వారికి కష్టార్జితాన్ని లాభాలుగా మార్చి వారికి ఇవ్వాలని దీపికా రవి ఎంతగానో భావించింది. ఆమె చదువు పూర్తైన వెంటనే తండ్రితో కలిసి 2017 వ సంవత్సరంలో వ్యాపారాన్ని ప్రారంభించింది. మునగాకులో రన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్ ఇంకా ఇతర పోషకాలు అధికంగా ఉంటాయని తెలుసుకుంది.



మునగాకుతో రెండు రకాల పొడులను తయారు చేసి అమ్మింది.ఆ తర్వాత 2018 వ సంవత్సరంలో తండ్రితో కలిసి 'ది గుడ్ లీఫ్' సంస్థను స్థాపించింది. కష్టాల్లో ఉన్న రైతులకు సహాయం చేస్తూనే విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా మునగ గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేస్తోంది. వందలాది మంది రైతులకు సహాయం చేస్తూ కోట్ల రూపాయలను ఆమె ఆర్జిస్తోంది. ప్రస్తుతం 200 మందికి పైగా రైతులు వారి ఉత్పత్తులను తమకు సరఫరా చేస్తున్నట్లు దీపిక చాలా గర్వంగా చెబుతోంది. వారి సరుకులకు తగిన ధర చెల్లిస్తున్నామని ఇంకా రైతులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొంది. మోరింగా(మునగ) పౌడర్ ఇంకా మోరింగ పాడ్స్ పౌడర్ అనే రెండు వస్తువులతో ప్రారంభించి గుడ్ లీఫ్ ఈ రోజు మోరింగా క్యాప్సూల్స్ ఇంకా అలాగే మోరింగా ఫేస్ ప్యాక్‌ల వరకు వివిధ రకాల వస్తువులను అందిస్తుంది. ఆయా ఉత్పత్తుల ధరలు వచ్చేసి రూ. 250 నుండి రూ. 490 వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: