తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి..వైరస్ చాప కింద నీరులా మారుతుంది.కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పుడు భారీగా పెరుగుతున్న కేసుల కారణంగా జనాల్లొ ఒక టెన్షన్ మొదలైంది.తెలంగాణలో మరోరోజు 500లకుపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.


మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు, శనివారం(జులై 2) 516 కేసులు, ఆదివారం(జులై 3) 457 కేసులు, సోమవారం(జులై 4) 443 కేసులు, మంగళవారం (జులై 5) 552 కేసులు, బుధవారం (జులై 6) 563 కేసులు, గురువారం(జులై 7) 592 కేసులు, శుక్రవారం (జులై 8) 608 కేసులు నమోదవగా.. తాజాగా ఆ సంఖ్య(జులై 9) 528గా ఉంది..


గడిచిన 24 గంటల్లో 24వేల 968 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 528 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 327 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 485 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు..మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్క కరోనా మరణం కూడా లేదు..8,05,665 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 96వేల 365 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ ను దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 189కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111..కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: