ఎక్కడో జరిగే ఆందోళనకు...మన ఇంట్లో మనం తాగే టీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? నిజమే. కానీ...ఆందోళన ఎక్కడో కాదు...మనదేశఃలో జరగుఉతోంది. మన పరిశ్రమను ప్రభావితం చేస్తోంది. కలకలం రేకెత్తిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం సెగ అసోం టీ పరిక్షిశమకు తగిలింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు.. చాలా టీ తోటల్లో ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్నాయి. చివరకు గువాహటి తేయాకు వేలం కేంద్రం వద్ద లావాదేవీలూ నిలిచిపోయాయి. తేయాకు సరఫరాలో సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పరిక్షిశమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతుండటంతో పోలీసులు కర్ఫూ విధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, కార్మికుల కొరత కారణంగా ఈ నెల 19 వరకు ఆకు సేకరణ సమయాన్ని టీ బోర్డు పొడిగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నిజానికి నాణ్యమైన తేయాకు కోసం ఈ నెల మధ్య నాటికే ఆకు సేకరణ ఆపేయాలని టీ బోర్డు స్పష్టం చేసింది. ‘శీతాకాలంలో ఎక్కువ డిమాండ్ ఉండనప్పటికీ.. చాలా తోటల్లో ఆకు సేకరణ, ఇతరత్రా ఉత్పాదక కార్యకలాపాలు ఈ ఆందోళనల కారణంగా ప్రభావితమవుతున్నాయి’ అని ఈశాన్య టీ అసోసియేషన్ సలహాదారు బైద్యనాద బార్కకోటి పీటిఐతో అన్నారు. నిజానికి గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే ఈ డిసెంబర్లో పరిస్థితులు టీ పరిక్షిశమకు అనుకూలంగా ఉన్నాయి. నాణ్యమైన తేయాకు ఉత్పత్తి అవుతున్నది. కానీ బంద్లు, నిరసనలతో ఉత్పాదక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతున్నదన్నారు.
అసోం చిన్నతరహా టీ తోటల నిర్వహణదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కరుణ మహ్నాట మీడియాతో మాట్లాడుతూ, ‘మంగళవారం బంద్తో అన్ని తోటలు మూతబడ్డాయి. మళ్లీ శుక్రవారం ఆకు సేకరణ మొదలైంది. కానీ రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పూర్తిస్థాయిలో కార్మికులు రాలేకపోతున్నారు’ అని పీటీఐకి తెలిపారు. ‘ప్రతీ వారం గువాహటి టీ వేలం కేంద్రంలో దాదాపు 40-45 లక్షల కిలోల తేయాకు అమ్ముడయ్యేది. కానీ ఈ వారంలో ఇప్పటిదాకా 15 లక్షల కిలోల అమ్మకాలే జరిగాయి’ అని గువాహటి టీ వేలం కొనుగోలుదారుల సంఘం కార్యదర్శి దినేశ్ బిహానీ అన్నారు.
ఇదిలావుంటే నిలిచిపోయిన ఇంట్నట్ సేవలు కూడా తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హింసాత్మక ఘటనలు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంట్నట్ సర్వీసులను పోలీసులు ఆపేస్తున్నారు. దీంతో కార్మికులకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని వ్యాపారులు అంటున్నారు.