మహిళలు ఎక్కడ తక్కువ కాదని ఓ మహిళా నిరూపించింది . ఈ కాలంలో మహిళా అంటే ఇలాగే ఉండాలని అనిపించింది. ఎప్పుడు మగాళ్లదే పై చెయ్యి అనుకుంటారు .కానీ ఇక్కడ భర్తను అత్తను చావబాదింది. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కట్టుకున్న భర్తని.. అత్తని చితక్కొట్టేసిందో భార్య. బిజినెస్ పార్టనర్‌తో భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త చేసిన పనికి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. 

 


ఇంటికొచ్చిన భర్తను నిలదీసింది. అడ్డుపడిన అత్తను తోసిపడేయడంతో ఆమె అవతలికి వెళ్లిపడింది. తల్లిని పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్తపై దాడి చేసి కొట్టింది. చంపేస్తానని బెదిరించడంతో భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది.ప్రకాష్ అనే వ్యక్తి లాయర్ గా పనిచేస్తున్నాడు. ఆమె భార్య ఒక బిజినెస్ లో చేస్తుండేది. 

 

పార్టనర్‌తో కలిసి సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆమె బిజినెస్ పార్టనర్ తరచూ ఆఫీస్‌కి వచ్చి వెళ్తుండడంతో భర్తలో అనుమానం రేగింది.తన భార్యకు ఆమె పార్టనర్‌తో అక్రమ సంబంధం ఉందన్న అనుమానం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. అలాగే తన ఆఫీస్‌లోని సిబ్బంది కూడా భార్య అక్రమ సంబంధం గురించి మాట్లాడుకుంటున్న విషయం ప్రకాష్ తెలిసింది. దీంతో ఆఫీస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు పెట్టించాడు. ఈ విషయం భార్యకు తెలిసింది.

 

ఇకపోతే ఒక రోజు లేటుగా వచ్చిన తన భర్తను సిసి కెమెరాల గురించి నిలదీసింది. అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారని.. అందుకే కెమెరాలు పెట్టించానని చెప్పడంతో భార్య ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్తను దారుణంగా తిడుతూ దాడి చేసింది. ఇద్దరికీ సర్దిచెప్పేందుకు మధ్యలో అడ్డుగా వచ్చిన అత్తను గట్టిగా తోసేసి అత్తను నెట్టేసింది. దానితో ఆమె గాయాలపాలైంది. అంతేకాకుండా చంపేస్తానని బెదిరించింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనను, తన తల్లిని కొట్టడమే కాకుండా చంపుతానని బెదిరింపులకు గురిచేస్తోందని అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: