మోడీ విషయంలో అన్ని విధాలా ఆయనలో అతి కనిపిస్తోందని చెబుతున్నారు. పథకాలు అమలు చేయొచ్చు..కానీ, అన్నీ పంపకాలతో కూడిన పథకాలే కావడం అతికాదా? అనేది విశ్లేషకుల మాట. నిధులు పంచే ప్రోగ్రాం అయినా.. ఒకటి రెండు ఉంటే తప్పులేదని అతిగా చేయడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా సతమతం కావడం, అప్పుల్లో కూరుకుపోవడం కనిపించడం లేదా? అనేది వీరి సూటి ప్రశ్న. ఇక, అతి మౌనం.. కూడా జగన్ను ఇబ్బంది పెడుతోందన్నది వీరి హెచ్చరిక.
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కొన్నాళ్ల కిందటి వరకు డిస్టెన్స్ మెయింటెన్ చేసి.. ఎంత వరకు ఉండాలో అంతే.. ఉన్న జగన్ ఇప్పుడు మాత్రం అతి చేస్తున్నారని… తన జుట్టును తీసుకువెళ్లి కేంద్రం పెద్దల చేతికి అందిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఏ లోపాలు ఉన్నా.. ఎన్ని విమర్శలు ఉన్నా.. రాష్ట్రాధినేతగా ఆయనే పరిష్కరించుకుంటే.. అప్పుడు ఉండే గౌరవం వేరని.. కానీ, ప్రతి విషయానికీ.. కేంద్రం వద్ద పంచాయితీ పెట్టుకుని, ఇక్కడి తన లోపాలను కూడా అక్కడ చర్చించుకునేలా వ్యవహరించడం వల్ల అంతిమంగా నష్టపోయేది జగన్, ఆయన పార్టీనేని అంటున్నారు. బీజేపీని అతిగా నమ్మిన నాయకులు.. పార్టీలు.. లాభించింది ఏమీలేదని.. అంత లాభమే ఉంటే.. బీజేపీ చూస్తూ ఊరుకోదని.. అంటున్నారు.