బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంట్లో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్గా మారింది. భారత్ - చైనా నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాలు తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ గతంలో ఆయన వార్తల్లోకెక్కారు. మరోవైపు ఆదివారం (అక్టోబర్ 25) విజయదశమి సందర్భంగా చైనా సరిహద్దుకు సమీపంలో సిలిగురిలో ఆయుధ పూజలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పాలని భారత్ భావిస్తోందని స్పష్టం చేశారు. శాంతిని స్థాపించాలని భారత్ కోరుకుంటోందని వెల్లడించారు. అలాగని అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంట్లో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్గా మారింది. భారత్ - చైనా నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాలు తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ గతంలో ఆయన వార్తల్లోకెక్కారు. మరోవైపు ఆదివారం (అక్టోబర్ 25) విజయదశమి సందర్భంగా చైనా సరిహద్దుకు సమీపంలో సిలిగురిలో ఆయుధ పూజలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పాలని భారత్ భావిస్తోందని స్పష్టం చేశారు. శాంతిని స్థాపించాలని భారత్ కోరుకుంటోందని వెల్లడించారు. అలాగని అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.