పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు ఓట్లు రెండు సీట్ల కోసం ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయాలా అంటూ కే టిఆర్ మండిపడ్డారు. అసలు ఈ స్థాయిలో రెచ్చగొట్టే విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలంటూ కేటీఆర్ నిలదీశారు. ఓట్ల కోసం వెళ్లి కాళ్లు పట్టుకుంటే ఓటు వేస్తారు కదా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ అంటూ బండి సెండ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు ? ఆయన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కొన్ని ఓట్లు సీట్ల కోసం, మతి స్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అంటూ బండి సంజయ్. పై మండిపడ్డారు.
పచ్చగా ఉన్న హైదరాబాదులో చిచ్చు పెడతారా అని
బిజెపి ని ఉద్దేశించి
కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్ లో బిజెపికి ఓట్లు సీట్లు రావాలన్నదే వారి ఆలోచన అని
కేటీఆర్ బీజేపి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ రోహింగ్యాల పై
జగన్ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యలు, పాకిస్థానీయులు , ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో
బిజెపి గెలవగానే పాతబస్తీ సర్జికల్ స్ట్రైక్ చేస్తామని రోహింగ్యాలు, పాకిస్థానీయులు బంగ్లాదేశీయులను తరిమి కొడతామని సంజయ్ హెచ్చరించారు. పాతబస్తీలో
రోహింగ్యాలు ఉంటే,
కేంద్ర హోంమంత్రి ఏంం చేస్తున్నారు అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్ననకు సంజయ్ ఈ విధంగా సమాధానం చెప్పగా ఆ వ్యాఖ్యలనుు
కేటీఆర్ తప్పుపట్టారు.