తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్రమక్రమంగా క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని  తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా బలమైన క్యాడర్ ఉన్న  కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో డివిజన్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు కూడా బరిలోకి దిగి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తామో  అన్న విషయాలను ప్రజలకు చెబుతూ ప్రస్తుతం ఓటర్ మహాశయులకు ఆకట్టుకునే పనిలో పడ్డారు కాంగ్రెస్ అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఆయా డివిజనల్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రచారం గడువు ముగియనున్న  నేపథ్యంలో అభ్యర్థులందరూ ప్రస్తుతం ప్రజల చెంతనే ఉంటూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.



 ఈ క్రమంలోనే ఇటీవల హబ్సిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమా సుధాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే హబ్సిగూడా డివిజన్ పరిధిలోని పి అండ్ టి  కాలనీ లో కాంగ్రెస్ కార్యకర్తలతో నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి ఉమా సుధాకర్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: