బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. పాత పట్నం అభివృద్ధి కావాలంటే బీజేపీ కి ఓటు వెయ్యండి అని ఆమె సూచించారు. కేసీఆర్ తెలంగాణ నీ జాగిరా.. 8వ నిజామా కేసీఆర్ నువ్ అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక గుణపాఠం షాక్ లో కేసీఆర్ ఉన్నాడు అని మండిపడ్డారు. ఇవాల్టి కేసీఆర్ ప్రసంగం లో ఓటమి భయం కనిపిస్తుది అని ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు రాగానే హామీలతో కేసీఆర్ మోసం చేస్తున్నాడు అని మండిపడ్డారు.

వర్షం పడితే...కార్లు పడవలు ఐతున్నాయి అన్నారు. రోడ్ లు అద్దాల చేస్తా అన్నాడు... రోడ్ లు పక్కన బెడితే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి అన్నారు. అమెరికాలో చదివిన వ్యక్తి భాష అదేనా..? అని ఆమె ప్రశ్నించారు. సంస్కారం లేని వ్యక్తి  కేటిఅర్ అన్నారు. డల్లాస్, ఇస్తాంబుల్ అంటున్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగంలో పస లేదు అన్నారు. జనాలు వర్షాల కష్టకాలం లో హుటాహుటిన ఎన్నికలకు వచ్చారు అని విమర్శించారు. ఎన్నికలు గెలిచేందుకే 10 వేలు తెరాస నేతలు కార్యకర్తలు జేబులు నింపారు అని ఆమె విమర్శలు చేసారు.

ఎన్నికలు అయ్యాకా10 వేలు ఇస్తాం అన్న హామీతో మరోసారి ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం రావాలి అన్నారు. ప్రాజెక్ ల పేరుతో రాష్టాన్ని కేసీఆర్ మోసం చేస్తున్నాడు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు... అయిన అబివృద్ది లేదు అని ఆమె విమర్శించారు. పక్క రాష్టం ఏపీ లో 30 లక్షల ఇల్లు కట్టారు..తెలంగాణ లో ఒక్క ఇల్లు గతిలేదు అన్నారు. హిదువులకు ముస్లిం ల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు అన్నారు. పేద ముస్లిం అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎన్నికల్లో పభం గడుపుతున్నారు అని విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: