కరోనా  వైరస్  పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించి ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుని  మారణహోమం సృష్టించడానికి కారణం చైనా అన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి చైనా కరోనా వైరస్ విషయంలో ఎన్నో అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రపంచ దేశాలను  నమ్మించే ప్రయత్నం చేస్తూనే వస్తుంది అనే విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్  లో ఉన్నటువంటి ఒక ల్యాబ్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ తర్వాత మార్కెట్లోకి వ్యాపించడం ఇక ఆ తర్వాత ఎంతో మందికి సోకడం.. ఇక ఈ విషయాన్ని గుర్తించిన డాక్టర్ లీ అనే డాక్టర్ను చైనా బంధించి భయపెట్టి అసలు విషయాన్ని బయటకు చెప్పకుండా చేయడం... తద్వారా ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందేలా చేయడం చైనా చేసింది అనే విషయం తెలిసిందే.


 ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ పూర్తిగా పాకి  పోయిన తర్వాత అప్పుడు మనిషి నుంచి మనిషికి ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతుంది అని బయటపెట్టి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కరోనా వైరస్ పరిశోధన చేసేందుకు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలను  కూడా చైనా అనుమతించలేదు. అంతేకాదు ప్రపంచదేశాలకు నిజాలు చెప్పకుండా తమ దేశంలో మాత్రం కరోనా వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది. ఇలా ప్రస్తుతం చైనా కరోనా రహిత దేశంగా మారితే ప్రపంచ దేశాలు మాత్రం కరోనా వైరస్ తో ప్రస్తుతం అతలాకుతలం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు చైనా ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ విషయంలో దొంగనాటకాలు మొదలుపెట్టి సంచలన ఆరోపణలు చేస్తోంది. కరోనా వైరస్ కు  చైనా కు సంబంధం లేదని భారత్ లోనే కరోనా వైరస్ పుట్టింది అంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థను  కరోనా వైరస్ పై నిలదీసింది చైనా. కరోనా వైరస్ చైనా ది అని ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారని కానీ కరోనా వైరస్ చైనా కు చెందినది కాదని.. తమ దేశంలో అందరూ సేఫ్ గానే ఉన్నారని.. ప్రపంచ వ్యాప్తంగా భారీగా మరణాలు సంభవించాయి  అంటే అది  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైఫల్యమే అని..  ఒకవేళ కరోనా వైరస్ చైనాలోనే వెలుగులోకి వస్తే చైనాలో ఎక్కువ మరణాలు ఉండాలి కదా కానీ చైనా లో ఎక్కువ మరణాలు లేవు అంటూ సంచలన ఆరోపణలు చేసింది చైనా.

మరింత సమాచారం తెలుసుకోండి: