ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం చైనా డబుల్ గేమ్కు తెరలేపి కరోనా వైరస్ కి చైనా కు సంబంధించింది కాదు అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కరోనా వైరస్ అసలు వుహాన్ నగరం లో పుట్టలేదని... భారత్ లోని కరోనా వైరస్ కు సంబంధించిన మొదటి కేసు నమోదయింది అంటూ ఇటీవల ఆరోపించింది చైనా. దీనికి సంబంధించి చైనా శాస్త్రవేత్తల దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేసింది. చైనా చేసిన ఆరోపణలతో ప్రపంచం కూడా ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల చైనా ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది.
ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు చెప్పిన భారత శాస్త్రవేత్తలు ఘాటుగా స్పందించారు. కరోనా వైరస్ మొదటి కేసు బంగ్లాదేశ్ భారత్ లో వెలుగులోకి వచ్చాయి అంటూ చైనా చేస్తున్న ఆరోపణలు ఇచ్చిన నివేదికలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి అంటూ స్పష్టం చేశారు భారత శాస్త్రవేత్తలు. చైనా శాస్త్రవేత్తల యొక్క విశ్లేషణ అత్యంత ఘోరంగా ఉంది అంటు భారత శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషులు కోతులు సహచర్యం ఎక్కువ కాబట్టి భారత్ లో కరోనా వైరస్ కి మొదటి కేసు వెలుగులోకి వచ్చింది చైనా శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదిక అర్ధరహితం అంటూ భారత శాస్త్రవేత్తలు ఘాటుగా బదులిచ్చారు.