తెలంగాణా హైకోర్టు ఎన్నికలకు సంబందించి ఇచ్చిన తీర్పు మీద బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటన  విడుదల చేశారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడింది,ఇప్పటికైనా కొంచమైనా సిగ్గు తెచ్చుకోండని అన్నారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందని, ఎన్నికల కమిషన్ ,రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి  తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకాన్ని  విశ్వాసాన్ని పెంచిందని అన్నారు. 


ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇదేనన్న ఆయన అడ్డదారుల్లో గెలవాలని చూసిన టిఆర్ఎస్ పార్టీ కి ఇది చెంపపెట్టు అని అన్నారు. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చెయ్యాలి ,లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలి,లేకపోతే ప్రజలే ఈ కెసిఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని అన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని సంజయ్ అన్నారు. టిఆర్ఎస్ ,ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయిందని ఉదయం నుండి ప్రతీ గంటకు పోలింగ్ శాతం ప్రకటించిన ఈ.సి, సాయంత్రం 5 నుంచి 6 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదు. అని ప్రశ్నించారు. 5 నుండి 6 గంటల వరకు 12% నుండి 18% శాతం ఎలా పెరిగింది ? హైకోర్టు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


 కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్నట్టుండి 90% శాతానికి పోలింగ్ పెరిగింది , ఇందులో ఏదో గాంబ్లింగ్ జరిగింది అనే అనుమానం ఉంది , వాటిమీద కూడా విచారణ జరపాలని ఆయన అన్నారు. దీనికి కెసిఆర్ ఏం సమాధానం చెబుతారు? అని సంజయ్ ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ ,ఎక్కడా ఎన్నికలు జరగలేదన్న ఆయన పెన్నుతో టిక్కులు పెట్టిన లెక్కపెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే అధికారం పోతదేమో అన్న ఆకలి , ఆపతి, ఆతృత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. ఎన్నికుట్రలు చేసిన బీజేపీ వైపే ప్రజలు ఉన్నారనే దానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్షాలు అని ఆయన అన్నారు. 





 


మరింత సమాచారం తెలుసుకోండి: