అయితే ఈ మహ్మారి జయించడానికి చాలా దేశాలు టీకాలు, వ్యాక్సిన్ లు కనుగొనే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత సైంటిస్టులు ఈ మహమ్మారికి విజయవంతంగా వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను నరేంద్ర మోడి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి దేశ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. లక్షల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు నిర్విరామంగా పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ వారి సేవలను కొనియాడారు. విధుల కోసమని వెళ్లిన సిబ్బందిలో కొంతమంది ఇంటికి తిరిగి రాలేదు అని చెబుతూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ వ్యాధి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, కరోనా కారణంగా ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయని విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే ఈ టీకాలు లభిస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్లు వచ్చినప్పటికి ప్రజలు కరోనా జాగ్రత్తలు మరవొద్దని ప్రధాని మోదీ సూచించారు.