తాజాగా మమత బెనర్జీపై బీజేపీ నేత, యూపీ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ ఓ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బంగ్లాదేశ్లో మమత ఆశ్రయం పొందుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ బంగ్లాదేశీయురాలని అన్నారు. బంగ్లాదేశ్ టెర్రరిస్టుల మార్గదర్శకత్వంలో బెంగాల్లో మమత పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె బంగ్లాదేశ్ లో ఆశ్రయం పొందేందుకు రెడీగా ఉన్నారంటూ విమర్శించారు. మమత బెనర్జీ పూర్తిగా బంగ్లాదేశీయురాలే. ఆమె అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాదుల మార్గదర్శకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నారు. దేశానికి ఆమె అత్యంత ప్రమాదకారిగా తయారయ్యారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె బంగ్లాదేశ్ ఆశ్రయం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని రాష్ట్ర మంత్రి కూడా అయిన శుక్లా పేర్కొన్నారు.
మమతపై బీజేపీ అగ్ర నేతలు ఇటీవల వరుసగా విరుచుకుపడుతుండగా, తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అనంద్ స్వరూప్ శుక్లా మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ‘భారత్ మాతాకీ జై, వందే మాతరం’ అన్న ముస్లింలకే దేశంలో గౌరవం దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.