ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మళ్లీ తన గొప్పతనం చాటుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌‌లో నిర్మిస్తున్న చారిత్రాత్మక అయోధ్య రామాలయానికి తనవంతుగా విరాళాన్న కూడా ప్రకటించాడు. అంతేకాదు దేశ ప్రజలంతా కూడా రామాలయ నిర్మాణానికి శక్తివంచన లేకుండా విరాళాలివ్వాలని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు. విరాళం ఇచ్చిన అనంతరం అక్షయ్ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో చివరిలో అక్షయ్ జైశ్రీరాం అని నినాదం చేయడం కొసమెరుపు.

అయితే అక్షయ్ కుమర్ ఎంత మొత్తంలో విరాళం ఇచ్చాడనే విషయం మాత్రం ప్రకటించలేదు. కానీ కరోనా సమయంలో పీఎం కేర్స్ సమయంలో అక్షయ్ ఒక్కడే రూ.25 కోట్ల మేర విరాళం ప్రకటించి అందరికీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణానికి కూడా అదేస్థాయిలో విరాళం ఇచ్చి ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. రామమందిరానికి విరాళం ఇచ్చిన విషయాన్ని అక్షయ్ ఓ వీడియో ద్వారా ద్వారా వెల్లడించాడు. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో చివర్లో అక్షయ్ జైశ్రీరాం అంటూ నినదించాడు.

అయోధ్య రామమందిర నిర్మాణం అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా విరాళాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ అద్భుత ఆలయ నిర్మాణానికి తమవంతుగా సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అయోధ్య రామమందిరం నిర్మాణానికి తనవంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఇటీవలే రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసిన రాష్ట్రపతి ఆ బృందానికి తన వ్యక్తిగత ఖాతా నుంచి ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చెక్కును అందజేశారు.

ఇదిలా ఉంటే గతేడాది ఆగష్టులో ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామమందిరానికి స్వయంగా భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి నిధులు సేకరించడం కోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిధుల సేకరణపై ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ దేశీయ మాట్లాడుతూ.. ఇప్పటికే లార్సన్ అండ్ టూబ్రోతో పాటు సీబీఆర్‌ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఇంజినీర్లు మట్టి సారాన్ని పరీక్షించారని, ఆ పరీక్షలతోనే రామజన్మభూమి నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. 36 నెలల నుంచి 40 నెలల సమయంలో రామమందిరం ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు.

 విదేశాల నుంచి విరాళాల సేకరణకు ట్రస్టుకు అనుమతి లేదని, దేశీయ విరాళాల ద్వారానే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. సాధారణ ప్రజలు ఇచ్చే విరాళాల సేకరణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: