వ్యాక్సిన్లను ఐఎల్ఆర్ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల అవి పాక్షికంగా స్తంభించినట్లు కాచర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లో సాంకేతిక లోపం వల్ల ఉష్ణోగ్రత పెరిగిపోయిందని చెప్పారు. దీంతో దీనికి బదులుగా ఆసుపత్రికి మరో బ్యాచ్ ఈ వ్యాక్సిన్లను పంపించాలని అసోం వైద్యఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై సరైన నివేదికను పంపించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించినట్లు అసోం ఆరోగ్యం శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు మూడు రోజుల నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ అందజేత కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్లను అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందులో పోలీసులు వైద్య ఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకే మొదటగా వ్యాక్సిన్లను అందిచనున్నట్లు తెలిపారు.