ఇక ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని ఉండడంతో ఈ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సింగిల్ జడ్జి ఎన్నికల కంటే వ్యాక్సిన్ ముఖ్యం కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించాలని అప్పీల్ చేశారు.
దీంతో మూడు రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 11 వ తారీకున ఎసిసి ఆదేశాలను సింగిల్ హైకోర్టు జడ్జి కొట్టి వేయగా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాలను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి ఏమాత్రం సుముఖంగా లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.