పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళలో అంతుచిక్కని వ్యాధి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... హుటాహుటిన  ఏలూరు బయలుదేరిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్ పరిస్థితిని సమీక్షించారు. పూళ్ళలో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో సియం ఆయా  అధికారులతో సమీక్షించారు. వెంటనే వెళ్ళి పరిస్థితిని పరిశీలించాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ను సియం ఆదేశించడంతో సిఎస్ ఇతర అధికారులు హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్ళారు.

ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం పూర్తి అప్రమత్తం చేయడంతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది అని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ తోపాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమీషనర్లు  ఏలూరు పూళ్ళ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇక మంత్రి ఆళ్ళ నానీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి అధికారులను అడిగి ఆరా తీస్తున్నారు.

తాజాగా ఆయన ఒక ఛానల్ తో మాట్లాడారు.  వింత వ్యాధి అదుపులోనే ఉంది అని ఆయన పేర్కొన్నారు.  పూళ్ళ, కొమిరేపల్లిలో ఎందుకు వ్యాపిస్తోందో అధ్యయనం చేస్తున్నారు  అని ఆయన వివరించారు. విపత్కర సమయంలో జనసేన,  ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నారు  అని మంత్రి మండిపడ్డారు. ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలు చేయడం తగదు అని ఆయన ఆరోపించారు. కొమిరేపల్లిలో జనసేన కార్యకర్తలు పోలీసులు,  వైద్యులుపైనా దూకుడుగా వ్యవహరించారు అని మండిపడ్డారు. జిల్లాలో ఈ వ్యాధి ప్రభలడం వెనుక కుట్ర కోణం ఉందేమో చూడాల్సి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: