ఈ విషయంలో కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. కానీ వాహనాలు రంగులు మార్చడానికి మూడు నెలల సమయం పడుతుందని అదీ కాక దీని వలన రాష్ట్రంపై ఆర్థికంగా అధిక భారం పడుతుందని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది...ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే ఈ విషయంపై జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు ఎస్ఈసి. తొలి సారిగా ఓ మెట్టు దిగారు నిమ్మగడ్డ. వాహనాల రంగుల అంశంపై తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకారం తెలిపారు ఎస్ఈసి. ఈ నిర్ణయంతో పిటిషన్ను డిస్పోజ్ చేసింది హైకోర్టు. ఈ వార్త అధికార పార్టీకి సంతోషం కలిగించింది. కొందరు మాత్రం మీరు మారి పోయారు సార్ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. మరి ఎన్నికల సమయానికి ఇంకెన్ని నిమ్మగడ్డ ఇంకెన్ని షాకులు ఇస్తాడో చూడాలి.