పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొప్పళ్లో స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఓ వ్యాపారవేత్త హోస్పేటలోని ఎంజే నగరలో తన ఆఫీస్ తెరిచాడు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో తరచూ..అతడు ఆమె ఇంటికి కూడా వెళ్లేవాడు..ఇదే అదునుగా సదరు కిలాడీ లేడి…వ్యాపారవేత్తను బురిడి కొట్టించేందుకు ప్లాన్ చేసింది..టీలో మత్తుమందు కలిపి అతడు మూర్చపోయేలా చేసింది. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన వ్యాపారవేత్త.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
ఇక ఇది జరిగిన రెండు రోజులకు ఆ వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన సదరు మహిళ.. అతని నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించింది. ఆ వీడియోలు కావాలంటే తనకు 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో అతడు చేసేది లేక ఆమె బ్యాంక్ అకౌంట్కు 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే మిగిలిన 15 లక్షల కోసం అతని చేసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆ మహిళ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. 2.750 గ్రాముల గంజాయి లభించింది. మహిళను ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన స్టైల్లో విచారించగా..అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.