ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మనిషి జీవితంలో మాస్క్ ఎంత తప్పనిసరిగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కూడా మాస్కు ధరించే వారు కేవలం దుమ్ము ధూళి నుంచి రక్షించుకోవడానికి మాత్రమే మాస్కు ధరించే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి ధరిస్తున్నారు ఎప్పుడైతే చైనాలో వెలుగులోకి వచ్చిన వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయిందో ప్రపంచం   మొత్తం మాస్కు ముసుగు లోకి వెళ్ళిపోయింది.  ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా బ్రతికి బట్ట కట్టాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇక రోజు రోజుకు మాస్క్ ఆవశ్యకత పెరిగిపోతూనే ఉంది.


 ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ప్రభుత్వాలు విధించిన నిబంధనను ఉల్లంగిస్తూ  మాస్కు ధరించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి భారీగా జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమయ్యాయి ప్రభుత్వాలు. ఇకపోతే ప్రస్తుతం అందరికీ కరోనా వైరస్ పై అవగాహన రావడంతో ఇక బాధ్యతాయుతంగా మాస్కు ధరించి కరోనా వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం మాస్కు ధరించి ఉన్నప్పటికీ కూడా కరోనా వైరస్ సోకుతుంది.



 అయితే ఇటీవలే ఓ అధ్యయనంలో మాస్ కు కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు పరిశోధకులు. ఒక మాస్క్ ధరించడం కంటే రెండు మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు అంటూ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. డబుల్ మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాధి కణాలు ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించ లేవు అంటూ చెప్పుకొచ్చారు. వస్త్రం తో చేసిన మాస్కుల కంటే సర్జికల్ మాస్కులు ఎంతో మేలు అంటూ సూచించారు. ధరించిన మాస్కులు ముఖానికి బిగుతుగా ఉండాలి అంటు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: