కరోనా కేసులు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. చాపకింద నీరు కాగా ఈ కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంది. అలాగే దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ముంబై లాంటి మహా నగరాల్లో అయితే డాక్టర్స్ ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు తొందరపడకూడదు. కోవిడ్ నుంచి కోలుకున్నాక కనీసం 4 నుంచి 8 వారాల వరకు టీకా అవసరం లేదు. కరోనా బారిన పడి కోలుకున్న 85శాతం మంది శరీరంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయి ఉంటాయి. మిగతా వారిలో టీ సెల్‌ ఆధారిత రక్షణ ఉంటుంది. ఈ దశలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది” అని నిపుణులు చెబుతున్నారు.

ఇక అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ప్రకారం 90 రోజులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం 6 నెలల వరకు కూడా వ్యాక్సినేషన్‌ వాయిదా వేసుకోవచ్చు. వాస్తవానికి చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా విధానాలు ఉన్నాయి.మొత్తంగా కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్నామంటేనే మనలో రక్షణ ఏదో ఒక రూపంలో (బీ లేదా టీ సెల్‌) ఉంటుంది. అంటే మళ్లీ కరోనా వచ్చే అవకాశం దాదాపు 6 నెలల వరకు తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకుంటే సరిపోతుంది.అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఇక కరోనా రాదు అనేది లేదు. కరోనా రావచ్చు.. రాకపోవచ్చు.. కానీ, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారి నుంచి కరోనా వ్యాపించదు అని నిపుణులు చెబుతున్నారు. అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ట్రాన్స్‌మిటర్లుగా మాత్రం ఉండట్లేదు.ఇక ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించండి...

మరింత సమాచారం తెలుసుకోండి: