గూగుల్ కస్టమర్లకు ఇది నిజంగానే షాక్ అనే చెప్పాలి.. జూన్ ఒకటో తేదీ నుంచి గూగుల్ ఉచిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఉచిత సేవలను మళ్లీ తిరిగి పొందాలంటే వాటికి కావలసిన ప్రత్యేక ఛార్జ్ లను చెల్లించి నిరభ్యంతరంగా పొందవచ్చు.. వినియోగదారులకు విషయం తెలియడానికి గాను తొలుత గూగుల్ ఫొటో ఉచిత క్లౌడ్ నిల్వ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నది. గూగుల్ ఫొటో క్లాట్ స్టోరేజ్‌ లో ఫొటోలు సేవ్ చేసుకోవాలంటే ఇకపై గూగుల్ సంస్థ పేర్కొన్న విధంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ లిమిటెడ్ సేవలను కష్టమర్లకు అందిస్తుంది.


వినియోగదారులు వారి ఫొటోలు, ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేసుకునే వీలుండేది. వీటిని ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా అందుబాటులో తీసుకోవచ్చేది. ఈ సేవలకు జూన్ నెల నుంచి చార్జీలను చెల్లించి వినియోగించాలని సంస్థ వెల్లడించింది.వచ్చే నెల నుంచి వినియోగదారులకు 15 జీబీ ఉచిత క్లౌడ్ నిల్వను మాత్రమే అందించనున్నది. వినియోగదారులు దీని కంటే ఎక్కువ ఫొటోలు లేదా పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేయాలనుకుంటే మాత్రం వారు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.


వీటికి ఎంత చార్జీలు వర్తిస్తాయి. అంటే 15 జీబీ కన్నా అదనపు డాటా అవసరమైన పక్షంలో నెలకు రూ.146 చెల్లించాలి. సంస్థ తరపున దీనికి గూగుల్ వన్ అని పేరు పెట్టారు. దీని వార్షిక చందా ఛార్జీ  రూ.1,464.. అయితే, కొత్త ఫొటోలు, వీడియోల నిల్వ కోసం మాత్రమే వినియోగదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పాత ఫొటోలు మునుపటిలా సురక్షితంగా నిల్వ చేయబడతాయి. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు ఉచిత అధిక నాణ్యత గల ఫొటో బ్యాకప్‌ను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 2,3,4,5 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఉచిత ఫొటో, వీడియో స్టోరేజ్ సౌకర్యం కూడా లభిస్తుంది.. ఇది నిజంగానే వినియోగ దారులకు షాక్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: