ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.  ఇక ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పై అవగాహన రావడమే కాదు... అటు యాక్షన్ తీసు కోవడం వల్ల ఎంతటి ప్రయోజనం ఉంటుందో అన్న విషయం కూడా తెలిసి వస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది  స్వచ్ఛందంగా టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.  ఇక్కడ ఎంతో మంది వ్యాక్సిన్ తీసుకుని ఇక ప్రజలందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి అంటూ పిలుపునిస్తున్నారు. ఇలాంటి సమయంలో నకిలీ దందా  రోజురోజుకు పెరిగిపోతోంది.



 మాయ మాటలతో నమ్మించి నకిలీ వ్యాక్సిన్లు వేసి చివరికి భారీగా డబ్బులు దండుకుంటున్నారు ఎంతమంది. మొన్నటి వరకు కేవలం సామాన్యులకు మాత్రమే ఇలాంటి నకిలీ వ్యాక్సిన్లు బెడద ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఎంతో మంది ప్రముఖులను సైతం టార్గెట్ చేస్తూ నకిలీ దందా కొనసాగిస్తున్నారు కేటుగాళ్లు.  ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నిర్మాతగా సురేష్ బాబు కు సైతం కేటుగాడు ఫోన్ చేసి టీకా పేరుతో లక్ష రూపాయలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.  ఇలా ఎంతో మంది ప్రముఖులకు సైతం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.



 ఇక్కడ ఒక నటి పార్లమెంటు సభ్యురాలు కి ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి ఇటీవలే నకిలీ వ్యాక్సిన్ కారణంగా ఆనారోగ్యానికి గురయ్యారు.  ఇటీవలే ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వేయించుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు.  దీంతో ఆసుపత్రికి పరుగులు పెట్టాడు పార్లమెంటు సభ్యురాలు మిమి చక్రవర్తి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను అనే విషయాన్ని తెలిపారు. ఇక ఆ తర్వాత పోలీసులు దీనిపై విచారణ జరపగా ఆమె వేసుకుంది నకిలీ వ్యాక్సిన్ అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mp