ఢిల్లీ: అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో సుమారు 50 మందికి పైగా గాయాలు, మొత్తం ఐదుగురు అస్సాం పోలీసు అధికారులు మృతి చెందారు. అస్సాం లోని కచ్చర్ జిల్లా ఎస్.పి కి తుపాకీ తూటాల గాయాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. అస్సాం పోలీసులకు వ్యతిరేకంగా మిజోరం పోలీసులు “లైట్ మెషీన్ గన్స్” (ఎల్.ఎమ్.జి) ను ఉపయోగించి కాల్పులు జరిపినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా ఇందుకు సాక్ష్యాధారాలున్నాయని ట్వీట్ లో పేర్కొన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఈ ఘటన “చాలా బాధాకరం, దురదృష్టకరం. దీని వెనుక ఉద్దేశాలు, పరిస్థితి తీవ్రత ఏమిటో చాలా స్పష్టంగా అర్థమౌతోంది”, అని పేర్కొన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ.
ఢిల్లీ: అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో సుమారు 50 మందికి పైగా గాయాలు, మొత్తం ఐదుగురు అస్సాం పోలీసు అధికారులు మృతి చెందారు. అస్సాం లోని కచ్చర్ జిల్లా ఎస్.పి కి తుపాకీ తూటాల గాయాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. అస్సాం పోలీసులకు వ్యతిరేకంగా మిజోరం పోలీసులు “లైట్ మెషీన్ గన్స్” (ఎల్.ఎమ్.జి) ను ఉపయోగించి కాల్పులు జరిపినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా ఇందుకు సాక్ష్యాధారాలున్నాయని ట్వీట్ లో పేర్కొన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఈ ఘటన “చాలా బాధాకరం, దురదృష్టకరం. దీని వెనుక ఉద్దేశాలు, పరిస్థితి తీవ్రత ఏమిటో చాలా స్పష్టంగా అర్థమౌతోంది”, అని పేర్కొన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ.