తీహార్ జైలు కు వెళ్ళి వచ్చిన వాళ్ళ కు  సైతం టిటిడి బోర్డు లో చోటు కల్పించడం సిగ్గు చేటు కల్పించారని ... రాజకీయా ల్లో బిచ్చ గాళ్లు... కోటీశ్వరులు అవుతు న్నారని...  కేంద్ర మాజీ  మంత్రి,  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC )  ప్రత్యేక ఆహ్వానితుడు  చింతా మోహన్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతుందని... డ్రగ్స్, గంజాయి ఎదేశ్ఛగా రవాణా సాగుతుందని నిప్పులు చెరిగారు. మహిళలు, బాలికపై లైంగిక దాడులు జరుగుతు న్నాయని... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో నిరుద్యోగం వలనే ఇలాంటివి సంభవిస్తు న్నాయని మండి పడ్డారు చింతా మోహన్.

  ఉద్యోగాలు లేక యువత చీప్ కోటర్ కొట్టి, గంజాయి తాగి రోడ్డులపై వీరంగం స్పష్టిస్తు న్నారని... సినిమా వాళ్ళు డ్రగ్స్ కొడుతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా చూపడం అవసరమా ? అని నిలదీశారు చింతా మోహన్.  వీలైతే డ్రగ్స్, గంజాయి సరఫరా అయ్యే చోటును నిర్మూలనం చేసే సత్త ప్రభుత్వానికి లేదని.... రాష్ట్రంలో ప్రజలు పేదరికంతో బతుకుతుంటే నాయకులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని నిప్పులు చెరిగారు.

చం ద్రబాబు ఇంటి పై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు చింతా మోహన్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో పాలన అస్తవ్యస్తం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీ గౌరవం నిలబడుతుందని... ఏపి పిసీసీ ప్రెసిడెంట్ మార్పు విషయంలో పార్టీ ఆలోచన చేస్తుందని నిప్పులు చెరిగారు చింతా మోహన్. ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడి కోసం వెతుకుతున్నామని... దీపావళి తరువాత కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందని క్లారిటీ ఇచ్చారు చింతా మోహన్.   కానీ కచ్చితంగా పీసీసీ ఎంపిక ఉంటుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd