తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వచ్చారు అని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మేమంతా కలిసి వారి ప్రయత్నం అడ్డుకున్నాం అన్నారు ఆయన. జోగి రమేష్ పై పోలీసులు కు మేము ఫిర్యాదు కూడా చేశాం అని ఆయన పేర్కొన్నారు. దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్న మా మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయం అని ఈ సందర్భంగా మండిపడ్డారు. పోలీసు అధికారులు సంఘం తో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు అని ఆయన ప్రస్తావించారు.

రాజకీయ వ్యవస్థ కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు అని ఆయన కామెంట్స్ చేసారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మా అధినేత ఇంటి మీదకు వచ్చిన జోగి రమేష్ పై బెయిల్ బుల్ సెక్షన్ లా గొడవ ను ఆపిన మా మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ల కింద కేసులా అంటూ బుద్దా ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసు అధికారులు సంఘం దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మేము దళితుల పేరుతో ఎక్కడైన దూషించామా... నిరూపించండి అంటూ ఆయన సవాల్ విసిరారు.

జోగి రమేష్ చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం పై మాట్లాడారు అని అన్నారు. కులాల కుంపట్లు పెట్టి.. రెచ్చ గొట్టింది వాళ్లు అంటూ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. తప్పు చేసిన వారిని వదిలేసి, మా పై అన్యాయం గా కేసులు పెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. చత్తీస్‌గఢ్ తరహాలో ప్రజలు పోలీసు ల పై తిరగబడే రోజు వస్తుంది అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం పెద్దలకు వంత పాడటం పోలీసు అధికారులు సంఘం మానుకోవాలి అని ఆయన హితవు పలికారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం .. నిజాయితీ అధికారులు జీవితాలను బలి చేయవద్దు అని ఆయన హితవు పలికారు. వరుస సంఘటనలు పరిశీలించి అప్పుడు సంఘాలు న్యాయం గా స్పందిస్తే స్వాగతిస్తాం అన్నారు. 2024ఎన్నికలలో టీడీపీ అధికారం లోకి రావడం ఖాయం అని ఆయన స్పష్టం చేసారు. చంద్రబాబు సిఎం కాగానే... వంద ఎకరాలలో పిచ్చి ఆసుపత్రి నిర్మాణం చేస్తాం అని వైసిపి మంత్రులు, ఎమ్మెల్యే లను చేర్పించి వారి మాటలను వారికే చూపిస్తాం అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: