ఇప్పటికే టీడీపీ, వైసీపీలు కౌన్సిలర్లతో క్యాంపులను నిర్వహిస్తుం డడంతో అసలు చైర్మన్ ఏ పార్టీ పరం అవుతుందా ? అన్న ఉత్కంఠ అయితే తప్పడం లేదు. ఇక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నడిపిసత్ఓన్న క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి కౌన్సెలర్లను తరలించే ఏర్పాట్లు ఇరు పార్టీలు చేసుకున్నాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు తమ పార్టీ కౌన్సిలర్లను దగ్గరుండి మరీ మునిసిపల్ కార్యాలయానికి తీసుకు వచ్చారు.
ఎందుకంటే రెండు పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది. ఇలాంటి టైంలో ఒక్క ఓటు తారు మారు అయినా చైర్మన్ పదవి ఇతర పార్టీలకు వెళ్లి పోతుంది. అధికార వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి 15, టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి పదహారు ఓట్లున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందేమోనన్న టెన్షన్ లో అయితే టీడీపీ వాళ్ల లో ఎక్కువుగా కనిపిస్తోంది.
ఇక టీడీపీ కౌన్సెలర్ల ను మునిసిపల్ ఆఫీస్కు తీసుకు వచ్చే ముందు ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ కౌన్సెలర్ల కు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు ఎలాంటి పొరపాట్లు చేయవద్దని కౌన్సెలర్లకు క్లాస్ పీకారు. ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకన్నా కూడా చివరి నిమిషంలో సీన్ మారుతుందేమోనన్న ఉత్కంఠ కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో నెలకొందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ అంతా ఒక్కటే ఉత్కంఠగా ఉంది.