ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీకి ప్లస్ అయింది. ఇలా టీఆర్ఎస్ బలం పెంచుకుంది. అలా బలంగా ఉన్న టీఆర్ఎస్కు చెక్ పెట్టాలంటే అంత సులువైన పని కాదు...టీఆర్ఎస్కు తగ్గట్టుగానే బలమైన క్యాడర్ వేరే పార్టీలకు ఉండాలి. అలా కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉంది...గానీ ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్తితుల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్పై వ్యతిరేకత బీజేపీకి కలిసొస్తుంది.
కాకపోతే బీజేపీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే...క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు లేకపోవడం. దాని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఢీకొట్టాలంటే బీజేపీకి అంత సులువు కాదు. ఇప్పటినుంచే రూట్ లెవెల్లో బీజేపీ బలపడాలి. అందుకు తగ్గట్టుగా బీజేపీ నాయకత్వం పనిచేయాలి.
బలమైన నాయకులని పార్టీలోకి తీసుకుంటే...క్యాడర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఆ దిశగా బీజేపీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అసలు ఈటల రాజేందర్ లాంటి నాయకులు పార్టీలోకి వస్తే....ఆయన్ని బీజేపీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఆయన ద్వారా...టీఆర్ఎస్లోని కీలక నాయకులని బీజేపీలోకి తీసుకురావొచ్చు...కానీ బీజేపీ మాత్రం ఆ పనిచేయడం లేదు. ఇలాగే ముందుకెళితే కేసీఆర్కు చెక్ పెట్టడం కష్టమైపోతుంది.