కానీ ఎవరు ఊహకందని విధంగా అగ్రరాజ్యాలకు షాక్ ఇస్తూ సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకుంది భారత్. అంతే కాదు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందించడం కూడా మొదలు పెట్టింది. చిన్న దేశాలకు వ్యాక్సిన్ సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటూ వస్తుంది భారత్.ఇక అటు వాక్సినేషన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే భారత్ ఏకంగా 150 కోట్ల వాక్సినేషన్ మార్కును దాటేసింది. అగ్రరాజ్యాలతో పోల్చిచూస్తే ఇది రెట్టింపు అనే చెప్పాలి. మేమే అగ్రదేశాలం అంటూ చెప్పుకునే అమెరికా బ్రిటన్ లాంటి ఎన్నో దేశాలకు భారత్ సత్తా ఏంటో తెలుస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.
వ్యాక్సినేషన్ గణాంకాలు అగ్రరాజ్యాలతో పోల్చిచూస్తే.. 2.5 నెలల్లోనే భారత్ ప్రపంచ వ్యాప్తంగా అరుదైన రికార్డు సాధించింది అన్నది ఇటీవల అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అమెరికాలో డిసెంబర్ 2020లో వ్యాక్సినేషన్ మొదలయ్యింది.. ఇప్పటివరకు అమెరికాలో 51 కోట్ల 52 లక్షల వ్యాక్సిన్ లు మాత్రమే అందజేసారు. యూనియన్ లో కూడా ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది కాగా ఇప్పటివరకూ 75.70 కోట్లు వ్యాక్సిన్ లు అందజేశారు. ఇండియాలో అక్టోబర్ 2021 న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇలా అగ్రరాజ్యాలు సాధించింది భారత్ రెండు నెలల్లోనే సాధించింది అని రికార్డులు చెబుతున్నాయి.