అయితే ఇప్పుడు వరకు చిన్నా చితకా ఆలయాలలో మాత్రమే దొంగలు చోరీకి పాల్పడేవారు. కానీ ఇటీవలే తెలంగాణలో ప్రముఖ క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో చోరీకి పాల్పడటం సంచలనం గా మారిపోయింది. ఏకంగా సీసీ కెమెరాల నిఘా లో ఉండే ఆలయంలో చోరీ జరగడం పోలీసులకు సవాల్ విసిరింది అని చెప్పాలి. పాపన్నపేట లో ఉన్న దుర్గ మాత ఆలయంలో గర్భాలయంలో ఉన్న చోరీకి పాల్పడ్డాడు దొంగ. ఈ క్రమంలోనే ఇక ఉదయం వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగింది అని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయడం మొదలుపెట్టారు.
ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దొంగ ఎవరు అనే విషయం ఇటీవల బయటపడింది. ఇక ఆ దొంగను అరెస్టు చేసిన పోలీసులు హుండీ ఆదాయం లో దొంగిలించిన సొమ్మును మొత్తం మళ్లీ రికవరీ చేశారు. ఈ క్రమంలోనే హుండీ పగల గొట్టి దొంగలించిన 2.80 లక్షల నగదు 7.5 తులాల బంగారం 250 గ్రాముల వెండి ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆలయ అధికారులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా ఆత్మకూరు కు చెందిన లక్ష్మారెడ్డి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.