ఇందులో భాగంగానే రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. అయితే ఈ గడువు కాస్త గత రాత్రితో ముగిసింది. అయితే అందరూ నైట్ కర్ఫ్యూ ఇక ఉండదేమో అని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అందరి ఊహలకు అతీతంగా నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితం చేసింది. ఎప్పటిలాగే రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉండనుంది. సరిగ్గా ఇక రెండు వారాల పాటు ఈ నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే ఈ కరోనా థర్డ్ వేవ్ లో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పాలి. కేవలం వ్యాప్తి మాత్రమే వేగంగా ఉంది.
అంతే కాకుండా కరోనా సోకిన వారు కేవలం వారం రోజుల వ్యవది లోనే రికవరీ అవుతున్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. కానీ కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రకారం ఇది కేవలం ఆరంభమే అని ఇంకో రెండు నెలల్లో అసలైన జాతర మొదలు కానుంది అని అంటున్నారు. మరి ముందు ముందు ఏమి జరగనుంది అనేది తెలియాలంటే ఎదురుచూడగా తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి