అయితే.. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని నిర్ణయించిన ఏపీ సర్కారు.. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త రేట్ల ప్రకారం.. గరిష్ఠంగా 150 రూపాయలు.. కనిష్ఠంగా 20 రూపాయలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సినీ ప్రముఖులతో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని.. త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. అన్ని థియేటర్లలో నాన్ ప్రీమియం సీట్లు 25% వరకు ఉండాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందట.
మల్టీప్లెక్సుల విషయంలో నాన్ ప్రీమియం సీట్లపై ఇంకా స్పష్టత రాలేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. గతంలో ప్రతి కేటగిరీలో మూడు తరగతులుగా సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించారు. ఆ మేరకు పాత జీవో విడుదలైంది. కానీ.. కొత్త జీవో ప్రకారం ఎకానమీ, డీలక్సు, ప్రీమియంగా విభజించి టికెట్ల ధరలు నిర్ణయిస్తారట. మల్టీప్లెక్సుల్లో రిక్లయినర్ సీట్లకు 250 రూపాయల వరకూ టికెట్ ఉంటుందట. ఈ కొత్త రేట్లు అటు సినీ వర్గాలకూ.. ఇటు ప్రేక్షకులకూ కూడా ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే.. ఇప్పడే ఇవి ఫైనల్ కాదు.. ఇంకా తుదిమెరుగులు దిద్దే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఈ నెలాఖరుకు జీవో వస్తుందని సినీ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి